పరిస్థితిని సమీక్షించిన ఈఎన్సీ చీఫ్
NEWS Apr 26,2025 07:59 am
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధమైంది తూర్పు నావికాదళం.పూర్తి సన్నద్ధతతో ఉండాలని సన్రైజ్ఫ్లీట్కు ఆదేశాలు జారీ చేశారు ఈఎన్సీ చీఫ్ పెందార్కర్. విశాఖ నావికాదళాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా పరిస్థితిని సమీక్షించారు. యుద్ధనౌకలు, సబ్ మెరైన్లలో పని చేసే సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా అరేబియా సముద్రంలో ఎయిర్క్రాఫ్ట్ కారియర్ విక్రాంత్ మోహరించింది.