పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు సంఘీభావంగా తెలంగాణ డీజీపీ ఆధ్వర్యంలో పోలీసులు భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇటీవల పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణా రహితంగా పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ పై యుద్దం ప్రకటించింది. దాడులు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా మృతుల కుటుంబాలకు మద్దతు తెలియ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.