మౌలిక సదుపాయాల రంగంలో ఒలెక్ట్రా ముందడుగు
NEWS Apr 25,2025 04:47 pm
మౌలిక సదుపాయాల రంగంలో ప్రముఖ ఎలెక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా కీలకమైన సాంకేతిక పురోగతిని సాధించింది. కాంక్రీట్ లో వినియోగించే స్టీల్ రీబార్ కు ప్రత్యామ్నాయంగా అత్యాధునిక గ్లాస్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ రీబార్ (జీఎఫ్ఆర్పీ)ని ఆవిష్కరించింది. ఈ ఆవిష్కరణ నిర్మాణ రంగంలో కాంక్రీట్ రీఇన్ఫోర్స్మెంట్లో ఒక నూతన శకాన్ని నెలకొల్పటంతో పాటు, అసమానమైన బలం, మన్నిక , సుస్థిరతను అందిస్తుంది. హైదరాబాద్ లో జరుగుతున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) వార్షిక బడ్జెట్ సమావేశాల్లో సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి జీ ఎఫ్ ఆర్ పీ రీబార్ ను ఆవిష్కరించారు.