ఆయిల్ పామ్ సాగుతో భారీ లాభం
NEWS Apr 24,2025 05:52 pm
మహబూబాబాద్ జిల్లా అలియర్ గ్రామ రైతు రూపిరెడ్డి గోపాల్ రెడ్డి ఆయిల్ పామ్ సాగు ద్వారా ఎకరాకు ₹90,000 లాభం పొందారు. 2021 సెప్టెంబర్లో నాటిన ఈ పంట, 2024 జులై నుంచి దిగుబడిని ఇవ్వడం ప్రారంభించింది. 10 నెలల్లో 40 మెట్రిక్ టన్నుల దిగుబడి, టన్నుకు ₹21,000 చొప్పున వచ్చింది. జిల్లా సేరికల్చర్, హార్టికల్చర్ అధికారి రంజిత్ పర్యవేక్షణలో ఈ రైతు ఎకరాకు 6.6 మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధించాడు. ఈ విజయం లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగును చేపట్టేందుకు స్థానిక రైతులను ప్రోత్సాహస్తోంది.