పదో తరగతి పరీక్షల్లో 600కు 600 మార్కులు
NEWS Apr 23,2025 05:44 pm
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థిని నేహాంజని సంచలనం సృష్టించింది. మొత్తం 600 మార్కులకు గాను 600 మార్కులు తెచ్చుకుంది. ఏపీ విద్యా వ్యవస్థలోనే తొలి విద్యార్థినిగా రికార్డ్ బ్రేక్ చేసింది. నేహాంజని స్వస్థలం కాకినాడ. ల్యాంగ్వేజ్ పేపర్లలో సైతం 100కు 100 మార్కులు రావడం విశేషం.