తల్లిదండ్రులు మంచి దినచర్య రూపొందించాలి
NEWS Apr 23,2025 05:46 pm
వేసవి సెలవుల సందర్భంగా మల్యాల మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు తమ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు. దీంతో ఈరోజుతో పాఠశాల పూర్తిగా ఖాళీ అయిపోయింది. అయితే సెలవుల సమయాన్ని కేవలం ఆటలకే కాకుండా జ్ఞానాన్ని పెంపొందించుకునే దిశగా వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ మానస సూచనలు చేశారు. పాఠశాల తిరిగి జూన్ 12న పునః ప్రారంభమౌతుందన్నారు.