నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలి : తపస్
NEWS Apr 22,2025 09:05 pm
నర్సాపూర్ లోని తపస్ కార్యాలయం లో తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని, దీనివలన విద్యార్థులలో జీవన నైపుణ్యాలు పెంపొందుతాయని, విద్యార్థులకు నచ్చిన వృత్తిని ఎంచుకొని ఉద్యోగాలు పొందడానికి, నచ్చిన సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంటుందని, అన్నారు.ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు నాయిని నరేందర్ గౌడ్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు