దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపీ
NEWS Apr 21,2025 05:03 pm
కోజన్ కొత్తూరు గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. బారాస రైతులను విస్మరించిందని, ఇవాళ అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆరోపించారు.కేటీఆర్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు లేవగానే కమీషన్లు, కరప్షన్లు కావాలన్నారు. రూ. 20 కోట్ల ఖర్చుతో బీఆర్ఎస్ సభ ఎందుకోసం పెడుతున్నారంటూ ప్రశ్నించారు . తక్షణమే పంటలను కోల్పోయిన రైతులను ఆదుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు.