మంత్రి పెళ్లిరోజు సందర్బంగా రోగులకు పండ్లు పంపిణీ
NEWS Apr 21,2025 03:22 pm
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మంజుల పెళ్లిరోజు సందర్భంగా సోమవారం మల్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మండల గౌడ సంఘం అధ్యక్షుడు మంద నాంపల్లి గౌడ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆదిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కాటిపల్లి శ్రీనివాస్, మారుతి, మల్లేశం, సాయి తదితరులు పాల్గొన్నారు.