గొల్లపూడి పంచాయతీకి ఆత్మ నిర్బర్ అవార్డు
NEWS Apr 21,2025 01:06 pm
ఏపీలోని విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకుంది. ఆత్మనిర్భర్ పంచాయతీ ప్రత్యేక విభాగంలో మూడో ర్యాంక్ను సాధించిన ఈ గ్రామ పంచాయతీకి 2025 జాతీయ పంచాయతీ అవార్డు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2022-23 సంవత్సరంలో స్వయం సమృద్ధి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనలో గొల్లపూడి పంచాయతీ చూపిన అసాధారణ పనితీరుకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును డిసెంబర్ 11, 2025న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమంలో అందజేయనున్నారు.