దేశం కోసం బీజేపీ ఏం త్యాగం చేసింది..?
NEWS Apr 20,2025 06:50 pm
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్ పీ లపై భగ్గుమన్నారు. దేశం కోసం జవహర్ లాల్ నెహ్రూ 14 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారని, స్వాతంత్ర పోరాటంలో తన ప్రాణాలను గాంధీ పణంగా పెట్టారని పేర్కొన్నారు. చివరకు గాంధీ కుటుంబం దేశం కోసం బలై పోయిందన్నారు. ఇందిర, రాజీవ్ తూటాల గుళ్లకు నేలకొరిగారని మరి మోదీ, అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఎలాంటి త్యాగాలు చేశారో చెప్పాలన్నారు.