సీఆర్వో పునర్వ్యవస్థీకరణపై ఈవో సమీక్ష
NEWS Apr 20,2025 06:25 pm
తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్ఓ) లో మెరుగైన వసతులు కల్పించేందుకు టీటీడీ ఈవో జె.శ్యామల రావు , అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి అన్నమయ్య భవన్ లో కేంద్రీయ విచారణ కార్యాలయం పునర్వ్యవస్థీకరణపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు వసతి, దర్శన టికెట్లు, ఇతర అవసరమైన సేవలను అందించే ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. అయితే గత కొంత కాలంగా, ముఖ్యంగా రద్దీ సమయంలో సీఆర్వోకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు.