టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
NEWS Apr 20,2025 03:13 pm
కోరిన కోర్కెలు తీర్చే శ్రీనివాసుడికి భక్తుల నుంచి పెద్ద ఎత్తున కానుకలు, విరాళాలు అందుతున్నాయి. బెంగళూరుకు చెందిన బీఎంకే నగేష్ అనే భక్తుడు టీటీడీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి దాత తరఫున విరాళం డీడీని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అందజేశారు.