గుజరాత్ కు చేరుకున్న మంత్రి నారాయణ
NEWS Apr 20,2025 02:57 pm
రెండు రోజుల అధికారిక పర్యటన కోసం గుజరాత్ కు చేరుకున్నారు మంత్రి నారాయణ. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాంతాల్లో అధ్యయనానికి వెళ్లారు మంత్రి బృందం. ఏక్తా నగర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించారు. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం దీని నిర్మాణాన్ని, అహ్మదాబాద్ శివారులో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (GIFT city) ని పరిశీలించారు. అహ్మదాబాద్ లోని CEPT యూనివర్సిటీ (సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ) సందర్శించారు.