నేను చేసిన పోస్టులు నా వ్యక్తిగతం
NEWS Apr 20,2025 02:12 am
సోషల్ మీడియాలో తాను చేసిన పోస్టులు పూర్తిగా వ్యక్తిగతం అన్నారు శ్రీరెడ్డి. విచారణలో కీలక విషయాలు వెల్లడించింది. వైసీపీ, జగన్ పై ఉన్న అభిమానంతోనే పోస్టులు పెట్టానని చెప్పింది పోస్టులకు సంబంధించి తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. కేవలం నా ఫేస్బుక్ ఖాతాలో మాత్రమే పోస్టులు పెట్టానని తెలిపింది. జగన్ పై అభిమానంతోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టానని ఒప్పుకుంది.