ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ
NEWS Apr 20,2025 01:53 am
విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంపై జగన్ సీరియస్ గా స్పందించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ గుండాయిజం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ మేయర్ పదవి నుంచి బీసీ మహిళను దించేయడం.. కూటమి చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష్య సాక్ష్యం అన్నారు.