విజయసాయి రెడ్డికి వైవీ సుబ్బారెడ్డి కౌంటర్
NEWS Apr 19,2025 04:55 pm
మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డిపై మండిపడ్డారు. పార్టీ నుంచి వెళ్లిపోయాక అభాండాలు వేస్తే ఎలా అని ప్రశ్నించారు. కోటరీ ఉందా లేదా అనేది అధికారంలో ఉన్నప్పుడు తెలియదా అని నిలదీశారు. తమ పార్టీలో ఒకటి నుంచి వంద వరకు జగన్ రెడ్డినే ఉంటారన్నారు. లిక్కర్ సహా అనేక అంశాలపై కేసులు పెడుతున్నా రంటూ ఆరోపించారు. తమ హయాంలో ఎలాంటి స్కామ్ జరగలేదన్నారు. కోర్టులో తేల్చుకుంటామన్నారు వైవీఎస్.