పంటలను కోల్పోయిన రైతులను ఆదుకోవాలి
NEWS Apr 19,2025 04:43 pm
కోరుట్ల నియోజకవర్గంలో అకాల వర్షం కురిసింది. ఈ సందర్బంగా వర్షకొండ, ఇబ్రహీంపట్నం, కోమటి కొండాపూర్, ఎర్దండి, కోజన్ కొత్తూర్, కేశవపూర్ , డబ్బ గ్రామాల్లో రైతులు వేసుకున్న పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రాలి పోయిన పంటలను పరిశీలించారు. నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 25 వేల ఆర్థిక సాయం చేయాలని, ఆదుకోవాలని కోరారు.