గోశాలలో జరిగిన అవినీతిపై విచారణ
NEWS Apr 19,2025 01:44 pm
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ప్రకటన చేశారు. వైసీపీ హయాంలో తిరుమల గోశాలలో జరిగిన అవినీతిపై ఏసీబీతో విచారణ చేయిస్తామన్నారు. ఈ సందర్బంగా తాను సీఎం చంద్రబాబును కలిసి ఎంక్వయిరీక చేయించేలా కోరుతానని చెప్పారు. గోశాలలో తప్పులు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించు కోలేరంటూ పేర్కొన్నారు.