ఢిల్లీలో కుప్ప కూలిన భవనం
NEWS Apr 19,2025 08:29 am
ఢిల్లీలోని ముస్తఫాబాద్లో శనివారం తెల్లవారుజామున భవనం కూలి పోవడంతో 4 మంది మృతి చెందారు. 10 మంది దాకా చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో 14 మందిని రక్షించారు. ఇంకొందరు శిథిలాల కింద ఉండడంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ అగ్ని మాపక కేంద్రం, పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.