టీటీడీ చైర్మన్ కు అర్చకుల ఆశీర్వాదం
NEWS Apr 19,2025 07:52 am
ఏప్రిల్ 05 నుండి 15 వరకు, కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరిగిన సందర్భంగా ఆలయ అర్చకుల టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో కలిసి వేద ఆశీర్వచనం చేశారు.అనంతరం స్వామి వారి తలంబ్రాలు, వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను చైర్మన్ కు అందించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీవో నటేష్ బాబు కూడా ఉన్నారు.