తిప్పేసిన స్పిన్నర్స్ ఆర్సీబీకి షాక్
NEWS Apr 19,2025 06:44 am
ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ స్పిన్నర్ల ధాటికి చేతులెత్తేసింది. వర్షం కారణంగా అంపైర్లు 14 ఓవర్లకు కుదించారు. పంజాబ్ స్కిప్పర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తన నిర్ణయం సరైనదేనని నిరూపించారు బౌలర్లు. చాహల్ , యాన్సన్ బెంగళూరును కట్టడి చేశారు తమ బౌలింగ్ తో. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులకే పరిమితమైంది. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ సైతం పోరాడింది. వధేరా దుమ్ము రేపాడు. తన జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు. 5 వికెట్ల తేడాతో ఓడించింది.