చంద్రబాబుపై భగ్గుమన్న కేఏ పాల్
NEWS Apr 18,2025 06:16 pm
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబుపై. ప్రవీణ్ పగడాల హత్య విషయాన్ని దారి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. అందులో భాగంగానే పాస్టర్లకు రూ. 5 వేల జీతం ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. పాస్టర్ ది హత్య అని మాట్లాడకుండా ఉండేందుకు ఇలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు . అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కుటుంబ అవినీతి అరాచక పార్టీలను వదిలేసి ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.