జైళ్ల శాఖ డీఐజీ పై ఫిర్యాదు
NEWS Apr 18,2025 10:59 am
జైళ్ల శాఖ డీఐజీపై మాజీ విశాఖ జైలు సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కులం పేరుతో దూషించారంటూ డీఐజీ రవికిరణ్ పై ఫిర్యాదు చేశారు. అరిలోవ పీఎస్ లో, ద్వారక ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ప్రిజన్స్ డీజీపీకి తనపై తప్పుడు నివేదిక సమర్పించారంటూ వాపోయారు. ఈ ఫిర్యాదును తూర్పు గోదావరి జిల్లా పోలీసులకు పంపించారు విశాఖ పోలీసులు.