గ్రూప్ -1 నియామకాలకు హైకోర్టు బ్రేక్
NEWS Apr 17,2025 08:00 pm
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు బిగ్ షాక్ తగిలింది. గ్రూప్ -1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ పరీక్షల నిర్వహణ, ఫలితాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ మొత్తం పరీక్షల రిక్రూట్మెంట్ పై విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ సందర్బంగా వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టిన కోర్టు తుది తీర్పు ఇచ్చేంత వరకు నియామకాలు ఆపాలని స్పష్టం చేసింది. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెసులుబాటు కల్పించింది.