రేషన్ కార్డుదారులకు తృణ ధాన్యాలు
NEWS Apr 17,2025 07:45 pm
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జూన్ నుండి రేషన్ కార్డుదారులకు తృణ ధాన్యాలుగా రాగులు అందించనుందని తెలిపారు మంత్రి నారాయణ. రూ.1,332 కోట్లతో తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే డబ్లింగ్కు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, విశాఖ రైల్వే జోన్, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా పూర్తి కానున్నాయని తెలిపారు. అమరావతి-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే, రింగ్ రోడ్, వాహన రవాణా విస్తరణ పనులు వేగంగా సాగుతున్నా యన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు తక్షణ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు.