ఇంకెన్ని రోజులు వడ్ల కొనుగోలు..?
NEWS Apr 17,2025 07:48 pm
కథలాపూర్ మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఆడంబరంగా ప్రారంభించిన కాంగ్రెస్ సర్కార్ ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ ప్రశ్నించారు జిల్లా బీజేపీ నాయకుడు గడ్డం జీవన్ రెడ్డి. కల్లాల వద్ద వరి ధాన్యం కుప్పల్లా పోశారని , ఇప్పటి వరకు ప్రొక్యూర్ మెంట్ చేయక పోవడం దారుణమన్నారు. అకాల వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్ట పోయే ప్రమాదం ఉందన్నారు. వెంటనే కొనుగోలును ప్రారంభించాలని డిమాండ్ చేశారు.