పాస్టర్ ప్రవీణ్ మృతిపై హైకోర్టు నోటీసులు
NEWS Apr 17,2025 06:57 pm
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏపీ హైకోర్టు రాష్ట్ర సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని సీఎస్ , హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. ఇదిలా ఉండగా ప్రవీణ్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కోర్టులో పిల్ పిటిషన్ దాఖలు చేశారు.