పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
NEWS Apr 17,2025 06:42 pm
పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి మండలం అప్పన్నపేట-అందులపల్లి గ్రామాల మధ్య రాజీవ్ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు లారీ ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.