జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కొరడా
NEWS Apr 17,2025 06:08 pm
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఝలక్ ఇచ్చింది మాజీ సీఎం జగన్ రెడ్డికి. దాల్మియాకు చెందిన రూ. 793 కోట్ల విలువ కలిగిన ఆస్తులను జప్తు చేసింది. కడప జిల్లాలోని సున్నపురాయి గనుల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని గతంలో సీబీఐ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై 2013లో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో జగన్ రూ. 180 కోట్ల మేర లబ్ది పొందారంటూ పేర్కొంది. సీబీఐ ఛార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కొరఢా ఝులిపించింది.