ఖాకీలపై మాజీ ఎమ్మెల్యే కాటసాని కన్నెర్ర
NEWS Apr 17,2025 05:59 pm
పోలీసులపై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రాష్ట్రంలో కొందరు దిగజారి విధులు నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ వాళ్లు ఏం చెప్తే అదే ఆచరిస్తున్నారని అన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామంటే కాదనం , కానీ టీడీపీ వాళ్లకు ఒక న్యాయం వైసీపీ వాళ్లకు ఇంకో న్యాయమా అంటే ఎలా అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలు, నాయకుల తప్పు లేకున్నా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.