మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన
NEWS Apr 17,2025 02:04 am
ప్రధాని మోదీ మే2వ తేదీన అమరావతిలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు సీఎస్ విజయానంద్. ప్రధాని మోదీ సభపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. రాజధాని పనులను పునః ప్రారంభించనున్నారు. నోడల్ అధికారిగా ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ ను నియమించినట్లు తెలిపారు సీఎస్. ప్రధాని సభకు 5 లక్షల మంది జనం హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.