ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
NEWS Apr 17,2025 01:02 am
ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో బాగంగా 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రయారిటీ ఇచ్చింది. టీడీపీకి 25, జనసేనకు 4, బీజేపీకి ఒక పోస్టు కేటాయించింది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీలకూ చైర్మన్లను ఎంపిక చేస్తామని తెలిపింది.