ఐపీఎల్ జట్లకు బీసీసీఐ అలర్ట్
NEWS Apr 17,2025 12:54 am
ఐపీఎల్లో ఫిక్సింగ్కి ప్రయత్నం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్ని జట్లు అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ హెచ్చరించింది. ఆటగాళ్లు, కోచ్ లు, ఇతర సభ్యుల కదలికలపై కన్నేసి ఉంచాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయాలని చూస్తున్నాడని తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని జట్లను ఆదేశించింది.