పాలమూరులో అమానవీయ ఘటన
NEWS Apr 16,2025 05:02 pm
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టేందుకు ముందుకు రాలేదు కొడుకు. కోటి రూపాయల ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే కొరివి పెడతానని పట్టు పట్టాడు. దీంతో చిన్న కూతురుతో తండ్రి తలకొరివి పెట్టించి అంత్యక్రియలు జరిపించారు బంధువులు. కొరివి పెట్టనంటూ పేచీకి దిగిన కొడుకుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.