గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల ప్రారంభం
NEWS Apr 16,2025 04:09 pm
మెట్ పల్లి వెల్లుల్ల గ్రామంలో పశుసంవర్థక శాఖ అధ్వర్యంలో ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యకమాన్ని మెట్ పల్లి మండల మార్కెట్ కమిటీ చైర్మెన్ కూన గోవర్థన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్, ఆత్మకూర్ పశు వైద్యాధికారి డాక్టర్ అశోక్ పాల్గొన్నారు. ఆవులు, గేదెలు, 3 నెలల పైబడిన దూడలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. పశు వైద్య సహాయక సిబ్బంది రమణయ్య, రమాదేవి, చిరంజన్ పాల్గొన్నారు.