మే 15 నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం
NEWS Apr 16,2025 08:53 am
సరస్వతి పుష్కరాలు మే 15 నుంచి ప్రారంభం కానున్నాయి. సరస్వతి పుష్కర్ - 2025 వెబ్ పోర్టల్ , మొబైల్ యాప్ ను ప్రారంభించారు మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ. కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు జరుగుతాయన్నారు. ఇందు కోసం రూ. 35 కోట్ల నిధులు కేటాయించామన్నారు. ప్రతి రోజూ 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు రావచ్చని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు మంత్రులు.