చాహల్ కమాల్ కోల్ కతా ఢమాల్
NEWS Apr 16,2025 08:13 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో అత్యంత ఉత్కంఠను రేపింది పంజాబ్స్ కింగ్స్ ఎలెవన్ , కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్. అత్యల్ప స్కోర్ ను ఛేదించే క్రమంలో బోర్లా పడింది కేకేఆర్. టాప్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కమాల్ చేశాడు. గెలవదని డిసైడ్ అయిన క్రమంలో మ్యాచ్ ను పూర్తిగా మార్చేశాడు. పంజాబ్ కు అపూర్వమైన విజయాన్ని కట్టబెట్టడంలో కీలక రోల్ పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు 4 వికెట్లు తీసి. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 111 పరుగులకే పరిమితమైంది. బరిలోకి దిగిన కోల్ కతా 95 పరుగులకు ఆలౌటైంది. 16 రన్స్ తేడాతో ఓడి పోయింది.