మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన
NEWS Apr 15,2025 06:04 pm
అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా వచ్చే మే2వ తేదీన ప్రధాని మోదీ పర్యటిస్తారని చెప్పారు సీఎం చంద్రబాబు. మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇంఛార్జ్ మంత్రుల పర్యటనలలో మూడు పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలని, రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం తగదన్నారు. సూర్యఘర్ పథకం అమలులో మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు.