గుడుంబా స్థావరం దాడులు
NEWS Apr 15,2025 05:48 pm
ములుగు మండలంలోని శ్రీరామ్ నగర్ తండాలో ములుగు ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై దాడి చేసి, 30 లీటర్ల నాటు సారా , 400 లీటర్ల బెల్లం పానకమును ధ్వంసం చేశారు. గుడుంబా తయారు దారులు ఐదుగురిపై కేసు నమోదు చేశామని ములుగు ఎస్సై తెలిపారు. ప్రభుత్వ నిషేధిత గుడుంబా ఎవరైనా తయారు చేసిన, అమ్మిన చట్టరీత్యా నేరం వారిపై కఠిన శిక్షలు ఉంటాయని ఎస్ఐ తెలిపారు.