ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ గోపురం ముందు గోదావరిఖనికి చెందిన శ్రీ గురు చరిత్ర పారాయణ ట్రస్ట్ సభ్యులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు ఉదయం అంజన్నను దర్శించుకున్న అనంతరం భక్తి శ్రద్దలతో హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు చేశారు. ఈ పారాయణంలో ట్రస్ట్ నిర్వాహకులు రాజన్న, వెంకన్న, ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.