అగ్ని ప్రమాదాలపై అవగాహన
NEWS Apr 15,2025 01:07 pm
అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా కే. కుమారస్వామి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ తన సిబ్బందితో ములుగు బస్ స్టాండ్ ఆవరణలో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల్లో అగ్నిప్రమాదాలపై చైతన్యాన్ని కల్పించేందుకు ప్రత్యేకంగా ఫైర్ ప్రమాదాలపై నీటితో వివిధ రకాల విన్యాసాల ద్వారా అగ్నిని ఆర్పే పద్ధతులు, ఫైర్ సిబ్బంది చేసే సహాయక చర్యలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పి.మహేశ్వర్, పి. సురేందర్, ఏం.మహేందర్, బి.రాజు, సిహెచ్. ప్రవీణ్, పి. సాయి కృష్ణ పాల్గొన్నారు.