అడవి పంది దాడి -ఒకరికి తీవ్ర గాయాలు
NEWS Apr 15,2025 01:06 pm
ములుగు మండలం ఇంచర్ల గ్రామానికి చెందిన పారానందుల నర్సయ్య తెల్లవారుజామున మొక్కజొన్న చేనులో నీళ్లు కడుతుండగా మొక్కజొన్న చేనులో చొరబడ్డ అడవి పంది ఒక్కసారిగా నర్సయ్యపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అరుపులు విన్న భార్య నర్సయ్య చూసి పక్కనే ఉన్న 39 సిఆర్పిఎఫ్ బెటాలియన్ వెళ్లి తెలుపగా సిఆర్పిఎఫ్ సిబ్బంది వచ్చి అతనిని కాపాడి ప్రథమ చికిత్స చేసి ములుగు ఏరియా హాస్పిటల్ కు తరలించారు.