కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశంస
NEWS Apr 15,2025 10:14 am
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తమ బీఆర్ఎస్ సర్కార్ సమయంలో కూడా నియోజకవర్గానికి నిధులు రాలేదన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకు వెళ్లిన మరుక్షణమే స్పందించారని కితాబు ఇచ్చారు. స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ వంటి కొత్త పథకాల్లో రెండు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. భూ సేకరణ కోసం సీఎంఓ నుంచి కలెక్టర్ కు ఆదేశాలు కూడా వచ్చాయని తెలిపారు. ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ గులాబీ దళంలో చర్చకు దారితీశాయి.