గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం
NEWS Apr 14,2025 04:06 pm
గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని కార్మిక శాఖను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బీమా, ఇతర హక్కులు కల్పించేలా బిల్లు ఉండాలని స్పష్టం చేశారు. ఈనెల 25 నాటికి బిల్లు తుది ముసాయిదా సిద్దం చేసి మే డే రోజున చట్టం అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు.