కేటీఆర్ పగటి కలలు కనడం మానుకో
NEWS Apr 14,2025 03:47 pm
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ పై మండిపడ్డారు. పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పూర్తి న్యాయం చేస్తున్నది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాహసోపేతమైన నిర్ణయమన్నారు. బీఆర్ఎస్ పదేళ్లపాటు ఏం చేసిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి, అన్ని వర్గాల వారిని పథకాల పేరుతో మోసం చేసింది మీరు కాదా అంటూ నిలదీశారు.