బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
NEWS Apr 14,2025 03:30 pm
దేశంలో వెనుకబడిన వర్గాల వారికీ అంబేద్కర్ చేసిన సేవలు అజరామరం అని మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి అన్నారు.అంబేద్కర్ 134 వ జయంతి సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ ఫోటోకి న్యాయవాదులు అందరూ పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ లేకుంటే సామాజిక అసమానతలతోనే నేటికీ కూరుకుపోయేవాళ్ళమని అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్. న్యాయవాదులు పాల్గొన్నారు