14న భూ భారతి పోర్టల్ ప్రారంభోత్సవం
NEWS Apr 13,2025 02:26 am
రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈనెల 14న భూ భారతి పోర్టల్ ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఎంపిక చేసిన మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తామని పేర్కొంది. భూ భారతి పోర్టల్పై ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని , ఈ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరించి పోర్టల్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు.