33 మందితో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ
NEWS Apr 13,2025 02:15 am
ఏపీలో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ బాస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి సర్కార్ కు వ్యతిరేకంగా ప్రజల తరపున గొంతును వినిపించేందుకు, సమస్యలపై పోరాడేందుకు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. తాజాగా 33 మందితో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు. పీఏసీ కన్వీనర్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. ఈ విషయాన్ని వైసీపీ అధికారికంగా వెల్లడించింది.