బీజేపీ అన్నాడీఎంకే కూటమికి కంగ్రాట్స్
NEWS Apr 12,2025 07:55 am
తమిళనాడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే కలసి ప్రజా క్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకోవడం ఆహ్వానించదగిన పరిణామం అని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడపాడి కె.పళనిస్వామి పేరును ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పాలనా పరమైన అనుభవం ఉన్న వారికి బాధ్యతలు అప్పగిస్తామని తమిళనాడు ప్రజలకు కూటమి తెలియ చేసిందన్ఆనరు. ఎన్.డి.ఎ. పాలనా విధానాలు ద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.